24 October, 2014

దేశ్ ముఖ్ గారి మృతికి తీవ్ర సంతాపాన్ని తెలియచేసిన ప్రముఖులు

సంతాప సభలో ప్రసంగిస్తున్న శ్రీ సోమయాజులు గారు, వనవాసీ అఖిల భారత సంఘటనా మంత్రి
23 అక్టోబర్, 2014న స్వర్గస్తులైన ఆర్.ఎస్.ఎస్. దక్షిణ మధ్య క్షేత్ర సంఘచాలక్ టి.వి.దేశ్ ముఖ్ గారి భౌతిక కాయానికి ఈ రోజు అనగా 24 అక్టోబరు 2014న ఉదయం 11 గంటలకు సైదాబాద్ లో అంత్యక్రియలు నిర్వహించబడినాయి. ఈ కార్యక్రమానికి ఆర్.ఎస్.ఎస్. క్షేత్ర, ప్రాంత స్థాయిలోని ప్రముఖులు, వివిధ క్షేత్రాల ప్రముఖులు, అనేక మంది ఇతర కార్యకర్తలు హాజరయ్యారు.

సంతాప సభ 
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంతాప సభలో ప్రముఖులందరూ పాల్గొన్నారు. దేశ్ ముఖ్ గారితో వారికి గల అనుబంధాన్ని తెలుపుతూ, వారి మృతిపట్ల వారి ప్రగాఢ సంతాపాన్ని తెలియచేశారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులలో మాన్య శ్రీ భాగయ్యగారు ఆర్.ఎస్.ఎస్. అఖిల భారత బౌద్ధిక్ ప్రముఖ్, శ్రీ సోమయాజులు గారు వనవాసీ అఖిల భారత సంఘటనా మంత్రి, శ్రీ కాశీపతి గారు శ్రీ సరస్వతీ విద్యాపీఠం అఖిల భారత సంఘటనా మంత్రి, శ్రీ మంగేష్ జోషి ఆర్.ఎస్.ఎస్. దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్, శ్రీ దూసి రామకృష్ణరావు క్షేత్ర కార్యవాహ, శ్రీ మురళీధరరావు గారు భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు, శ్రీమతి నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రివర్యులు, శ్రీ అప్పాల ప్రసాద్ గారు సామాజిక సమరసతా వేదిక నాయకులు, శ్రీ శ్యాంకుమార్ గారు ఆర్.ఎస్.ఎస్. తెలంగాణ ప్రాంత ప్రచారక్, శ్రీ చామర్తి ఉమామహేశ్వరరావు గారు ఐ.ఎ.ఎస్. రిటైర్డ్, ప్రముఖ సామాజిక కార్యకర్త, వివేకానంద 150 జయంతి ఉత్సవాల రాష్ట్ర కార్యదర్శి తదితరులు ఉన్నారు.









No comments:

Post a Comment